Sep 07,2023 13:11

అమరావతి : ఇటీవల సెలబ్రిటీల ఇళ్లల్లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఐశ్వర్య రజనీకాంత్‌, శోభన, సింగర్‌ విజయ్ ఏసుదాస్‌ ఇంట చోరీ జరిగిన సంఘటనలు తెలిసిందే. మరో సీనియర్‌ హీరోయిన్‌ నిరోషా ఇంట దొంగతనం జరిగిన వార్త వెలుగుచూసింది. చెన్నైలోని తన ఇంట్లో బంగారు నగలతోపాటు కొన్ని ఆస్తి పత్రాలు కూడా కనిపించకుండా పోయాయంటూ ... నిరోషా.. తేనాంపేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.