Nov 14,2023 23:13

విజయవాడలో...


విజయవాడ : సింగ్‌నగర్‌ యంబి స్టేడియంలో బుధవారం జరిగే ప్రజారక్షణ భేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఎం సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యలో సింగ్‌నగర్‌ డాబాకొట్లు సెంటర్‌లో మంగళవారం ఉదయం వివిధ రూపాల్లో విస్తృత ప్రచారం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళా బృందాల ద్వారా ప్రచారం జరిగింది. ప్రధాన రహదారి పక్కన బ్యానర్‌ చేబూని, వచ్చీపోయే వారికి కరపత్రాలు పంపిణీ చేస్తూ, సభకు ఆహ్వా నం పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి భూపతి రమణారావు, కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు. విస్సన్నపేట: నేడు జరగనున్న ప్రజా రక్షణ భేరిని జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభకు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. బివి.రాఘవులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొంటారని సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు అన్నారు. వన్‌టౌన్‌ : ప్రజా రక్షణ భేరి జయప్రదం చేయాలని 50వ డివిజన్‌ కార్పొరేటర్‌, సిపిఎం పశ్చిమ సిటీ కార్యదర్శి, సిఐటియు మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు బోయి సత్యబాబు పిలుపు నిచ్చారు. మంగళవారం వన్‌టౌన్‌ గాంధీ పార్కు వద్ద స్థానికులతో బోయి సత్యబాబు సమావేశం నిర్వహించారు. విజయవాడ : ప్రజారక్షణ భేరిలో పాల్గొని సభను జయప్రదం చేయాలని మొగల్రాజపురం కష్ణాజిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. తూర్పు సిటీ ప్రధాన కార్యదర్శి బెనర్జీ, స్థానిక నాయకులు, సిపిఎం నాయకులు మురహరి పాల్గొన్నారు.