Nov 10,2023 22:40

బాలుడి గాయాలు

ప్రజాశక్తి ఇబ్రహీంపట్నం : పశ్చిమ ఇబ్రహీంపట్నంలో కోతుల బెడదతో శుక్రవారం బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పశ్చిమ ఇబ్రహీంపట్నంలో ఇంటి ముందు ఆడుకుంటున్న మనోజ్‌ సాయి (12) ప్తె దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేశాయి కోతులు. ఇప్పటికే కోతులు ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తాయే తెలీక భయాందోళనలో జీవిస్తున్నారు. ఈ ఘటనతో మరింత భయాందోళనకు గురవుతున్నారు. గాయపడిన బాలుడు ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గతంలో కూడా పలువురిపై కోతులు దాడి చేసిన సంఘటనలున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వీటిని భయపెట్టడానికి కొండముచ్చును గ్రామంలో తిప్పేవారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుండి కాపాడాలని కోరుతున్నారు.