Nov 15,2023 21:57

దుర్గగుడి దేవస్థానాన్ని గాజులతో అలంకరించిన ఆలయ అధికారులు

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్ర కీలాద్రిపై శ్రీ అమ్మవారి గాజుల అలంకరణ మహాోత్సవం సందర్భంగా బుధవారం దుర్గమ్మను రంగు రంగు గాజులతో అలంకరించారు. అంతేగాక ఆలయ ప్రాంగణాన్ని వివిధ వర్ణముల గాజులతో అమ్మవారి ప్రధానాలయము, ఉపాలయములు, దేవతామూర్తులు మరియు మహామండపం ఆరవ అంతస్తు నందు గాజులతో అలంకరించారు. ఈ సందర్భంగా దుర్గమ్మ దర్శనంకు వచ్చిన వారు గాజుల అలంకర ణలో దర్శన మిస్తున్న దుర్గమ్మను దర్శించి తరిస్తున్నారు.
దుర్గమ్మ సన్నిధిలో హీరోయిన్‌ హన్సిక
ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకరణలోని జగన్మాత కనక దుర్గమ్మను హీరోయిన్‌ హన్సిక బుధవారం దర్శనం చేసుకున్నారు. హన్సికను ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వ దించారు. కనక దుర్గమ్మ చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. మై నేమ్‌ ఈజ్‌ శతి మూవీ ప్రమోషన్స్‌ కోసం విజయవాడకు వచ్చిన హన్సిక మీడియాతో మాట్లాడుతూ నవంబర్‌17న వరల్డ్‌ వైడ్‌గా తన చిత్రం విడుదల కానుందని, ప్రేక్షకులు తన చిత్రాన్ని ఆదరించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్టు ఆమె తెలిపారు.