Nov 17,2023 00:21

క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలిస్తున్న పోలీసులు

పజాశక్తి -పిఎం పాలెం : విశాఖ వేదికగా ఈ నెల 23 తేదీన జరగనున్న భారత్‌- ఆస్ట్రేలియా టి-20 మ్యాచ్‌కు ఆఫ్‌ లైన్‌ టికెట్ల అమ్మకాలు శుక్రవారం ప్రారంభంకానున్నాయి. వైఎస్‌ఆర్‌ ఎసిఎ, విడిసిఎకు సంబంధించి బి గ్రౌండ్‌ వద్ద ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో విక్రయాలు పూర్తవడంతో ఆఫ్‌లైన్‌ కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున డిమాండ్‌ పెరగనుంది. 17, 18 తేదీల్లో బి గ్రౌండ్‌, ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియం, గాజువాక రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలలో ఉదయం 11 గంటల నుంచి ఆఫ్‌లైన్‌ టికెట్లు విక్రయిస్తారని ఎసిఎ కార్యదర్శి ఎస్‌ఆర్‌.గోపీనాథరెడ్డి తెలిపారు. రూ.600, రూ.1500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000 ధరల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆఫ్‌ లైన్‌ ప్రక్రియలో 11,500 టిక్కెట్ల విక్రయాలు జరపనున్నట్లు వివరించారు.