Nov 10,2023 00:14

శంకుస్థాపన చేస్తున్న మేయర్‌ గొలగాని, ఎంపీ ఎంవివి

ప్రజాశక్తి - ఆరిలోవ, సీతమ్మధార : జివిఎంసి 9వ వార్డు పరిధి విశాలాక్షినగర్‌ పరిధి షిరిడి సాయిబాబా వెటర్నరీ కాలనీ, సంజరుగాంధీ కాలనీ, కైలాసగిరి తదితర ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులకు తూర్పు నియోజవర్గం సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ, వార్డు కార్పొరేటర్‌ కోరుకొండ స్వాతి దాస్‌తో కలిసి మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ, షిరిడి సాయి బాబా వెటర్నరీ కాలనీలో రూ.85 లక్షల వ్యయంతో భూగర్భ డ్రెయినేజీ పైపులైన్ల పొడిగింపు పనులకు, సంజరుగాంధీ కాలనీలో సుమారు రూ.37.46 లక్షలతో సామాజిక భవనం, హనుమంతువాక కూడలి నుంచి సింహగిరి కాలనీ వరకు రూ.48.71 లక్షలతో కాలువల మరమ్మత్తులు, నూతన కాలువల నిర్మాణానికి, కైలాసగిరి బీచ్‌ వద్ద సుమారు రూ.37.90 లక్షలతో బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి అధికారులు, వైసిపి వార్డు ఇన్‌ఛార్జి ఉమ్మడి దాసు, మోహన్‌రెడ్డి, మరిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సీతమ్మధార : జివిఎంసి 44వ వార్డు పరిధి రామచంద్రనగర్‌లో రూ.80 లక్షల వ్యయంతో బీటీ రోడ్లు, పలు అభివృద్ధి పనులకు జివిఎంసి ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు సమక్షంలో ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. వార్డులో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఇ రమణమ్మ, 44వ వార్డు నాయకులు సీతారాములు, దుర్గాప్రసాద్‌, సన్యాసిరావు, కన్నప్పడు, మహేష్‌, రాజు, గోపి, వెంకట్‌, మల్లేశ్వరావు పాల్గొన్నారు.