Jul 25,2023 15:50

హైదరాబాద్‌: తెలంగాణలో స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షకు సమయం సమీపిస్తుండటంతో హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఈ పోస్టులకు తొలిసారి ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల అవగాహన కోసం 'ఎమ్‌హెచ్‌ఎస్‌ఆర్‌బి' వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్ట్‌ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.రాష్ట్రంలో మొత్తం 5,204 స్టాఫ్‌నర్సుల పోస్టుల కోసం 40,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 2న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష సిబిటిను హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ కేంద్రాల్లో మూడు షిఫ్ట్‌లలో ఉదయం 9 గంటల నుంచి 10.20 గంటల వరకు , 12.30-1.50గంటల వరకు, మరలా సాయంత్రం 4గంటల నుంచి 5.20గంటల వరకు నిర్వహించనున్నారు.