Nov 22,2023 10:57

విశాఖ : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన మత్స్యకారులను సిపిఎం నేతలు బుధవారం కలిశారు. మత్స్యకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మీడియాతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావుతోపాటు కే.లోకనాథ, ఎం.సుబ్బారావు, ఎం.జగ్గు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.