Nov 16,2023 23:02

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: విజయవాడ రన్నర్స్‌ ఆధ్వర్యంలో విజయవాడ మారథాన్‌ ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మణీ దీపక్‌ తెలిపారు. మారథాన్‌ కు సంబంధించిన మెడల్స్‌, టీ షర్ట్‌ ఆవిష్కరణ గురువారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా మణీ దీపక్‌ మాట్లాడుతూ రన్‌ ఆదివారం గాంధీ నగర్‌ జింఖానా గ్రౌండ్స్‌ నుండి మొదలై బిఆర్‌టిఎస్‌ రోడ్డు మీదగా సాగుతుందని నిర్వాహకులు మణిదీపక్‌ తెలియజేశారు. దీనికి సంబంధించిన మెడల్‌ మరియు టీ షర్టును శ్రీరామ్‌ ఫైనాన్స్‌ జనరల్‌ మేనేజర్‌ ఈడ్పుగంటి నాగేంద్ర, ఐరన్‌ మాన్‌ ఫినిషర్‌ డాక్టర్‌ రుషిల్‌లు ఆవిష్కరించారు నిర్వాహకులు మాట్లాడుతూ ఈవెంట్‌ 19వ తేదీ ఆదివారం ఉదయం ఐదు గంటలకు మొదలవుతుందని, 5 కి.మీ, 10 కి.మీ, మరియు 21 కి.మీ గా మూడు విభాగాలలో జరుగుతుందని తెలిపారు. పలు రాష్ట్రాల నుండి 1800 మంది రన్నర్లు పాల్గొంటున్నారని, ఇంకా రిజిస్టర్‌ కాని వారి కోసం శనివారం జింఖానా గ్రౌండ్స్‌లో ఉదయం పది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మరింత సమాచారం కోసం 7815955123 నెంబర్‌కుగానీ, షషష.ఙఱjayaషaసaతీబఅఅవతీర.షశీఎను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రన్నర్స్‌ సెక్రటరీ బాబి, శ్రీరామ్‌ చిట్స్‌ జనరల్‌ మేనేజర్‌ యం.ఎస్‌ చౌదరి పాల్గొన్నారు.