తూర్పు గోదావరి (పిఠాపురం) : దేశ వ్యాప్త బంద్లో భాగంగా పిఠాపురం పట్టణంలో వామపక్షా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంక్లు, వస్త్ర, వాణిజ్య దుకాణాలను మూయించారు. కొన్ని దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కూరకుల సింహాచలం, కోనేటి రాజు, కరణం విశ్వనాధం, ఎం.సూరిబాబు, వి.సూర్యనారాయణ, కె.నాగేశ్వరరావు, సీపీఐ నాయకులు కె.అప్పలరాజు, లోవరత్నం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పిల్లా చంద్రం తదితరులు పాల్గొన్నారు.