Oct 28,2023 11:46

ప్రపంచకప్ ముగిసిన వెంటనే భారత్ తో మొదలయ్యే ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం 14 మందితో కూడిన బృందాన్ని శనివారం ప్రకటించింది ఆస్ట్రేలియా బోర్డు. రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న ప్యాట్ కమిన్స్ కు విశ్రాంతి ఇచ్చారు. అలాగే, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్, మిచెల్ మార్ష్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు కూడా విరామం ఇచ్చారు.ఈ సిరీస్ కోసం టీ20 కెప్టెన్ గా మాథ్యూ వేడ్ ను ఖరారు చేసింది ఆస్ట్రేలియా బోర్డు. మాథ్యూవేడ్ తోపాటు, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టోయినిస్, ట్రావిస్ హెడ్, నాథన్ ఎల్లిస్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జాసన్ బెహ్రెన్ డార్ఫ్, స్పెన్సర్ జాన్సన్, సియాన్ ఎబాట్, మ్యాట్ షార్ట్, జోష్ ఇంగ్లిష్, టిమ్ డేవిడ్, తన్వీర్ సంఘా ను ఎంపిక చేశారు. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ నవంబర్ 23న వైజాగ్ లో మొదలు కానుంది. 26న తిరువనంతపురం, 28న గువహటి, డిసెంబర్ 1న నాగ్ పూర్, డిసెంబర్ 3న హైదరాబాద్ లో మిగిలిన మ్యాచ్ లు జరుగుతాయి.