Nov 20,2023 08:03

చెన్నై :   ప్రముఖ తమిళనటుడు దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డిఎండికె) వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి విజయ్‌కాంత్  ఆస్పత్రి పాలయ్యారు. శనివారం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు.   సాధారణ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒకటి రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని, పుకార్లను నమ్మవద్దని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
గత కొంతకాలంగా విజయకాంత్‌ డయాబెటిస్‌ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే ఆయన మూడు వేళ్లను డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం నడవలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినట్లు వైద్యులు తెలిపారు.