Jul 28,2023 15:14

అమరావతి : దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్‌ సేవక్‌ ఉద్యోగాల భర్తీకి తపాలాశాఖ మే నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్‌ ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థుల రెండో జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయగా.. తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాను https://indiapostgdsonline.gov.in  లో అందుబాటులో ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 118 పోస్టులు ఉండగా, తెలంగాణలో 96 ఉన్నాయి. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 6లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌, అసిస్టెంట్‌ పోస్ట్‌ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్‌ జనరేటర్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేశారు.