Aug 19,2023 15:30

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్ట్‌ మేన్‌ గా విధులు నిర్వహిస్తున్న సీతరాం నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోస్ట్‌ ఆపీస్లో వచ్చిన విలువైన ఉత్తరాలు ఆధార్‌ కార్డులు, పాన్‌ కార్డులు, పాస్‌ పోర్టులు, ఏటీఎం కార్డులు, ఎల్‌ఐసి బాండ్లు ఇతర విలువైన ఉత్తరాలను గత 8 నెలలుగా పోస్టులో వచ్చిన ఉత్తరాలని వారికి ఇవ్వకుండా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. పట్టణానికి చెందిన ప్రజలు తమ ఉత్తరాలు రాలేదని పోస్ట్‌ ఆఫీస్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా పోస్ట్‌ ఆఫీస్‌ ఇన్చార్జి ఇన్స్పెక్టర్‌ వేణు అధికారులు పోస్ట్‌ మెన్‌ సీతారాం ఇంట్లో ఈరోజు తనిఖీలను నిర్వహించగా పోస్ట్‌ మాన్‌ సీతారం ఇంట్లో 50 బస్తాలలో పాన్‌ కార్డులు, పాస్‌ పోర్టులు, ఆధార్‌ కార్డులతో పాటు ఇతర విలువైన ఉత్తరాలు దొరికాయి. పోస్ట్‌ ఆఫీస్‌ లో వచ్చిన ఉత్తరాలని ప్రజలకు ఇచ్చినట్లు తమ సెల్‌ ఫొన్‌ లకు మెసేజ్‌ లని పోస్ట్‌ మాన్‌ సీతారాం మెసేజ్లు చేయగా భాదితులు అనుమానానికి గురిఅయ్యరు. దింతో బాదితులు పోస్ట్‌ ఆఫీస్‌ లో ఫిర్యాదు చేయగా పోస్ట్‌ మెన్‌ సీతారాం నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.