ఒడిశా : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 261 పైగా మృత్యువాత పడగా.. 900 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పెను ప్రమాదంపై భారత క్రికెటర్ విరాట్ కోహ్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపాడు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో ఇంత మంది మృతి చెందడం తన మనసును కలిచి వేసిందని విరాట్ ట్వీట్ చేశాడు.
Saddened to hear about the tragic train accident in Odisha. My thoughts and prayers go out to the families who lost their loved ones and wishing a speedy recovery to the injured.
— Virat Kohli (@imVkohli) June 3, 2023










