Aug 06,2023 09:40

ప్రజాశక్తి-మడకశిర రూరల్‌ (అనంతపురం) : మడకశిర మండలం ఒంటిపాళ్యం గ్రామంలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ... ఖాళీ బిందెలతో మహిళలు ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రెండు నెలలుగా మంచినీరు లేక ఇబ్బందులు పడుతూ పొలాల దగ్గర నీటిని తెచ్చుకుంటున్నామని వాపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పటించుకొని తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.