Nov 13,2023 13:14

అరకు (అల్లూరి) : టూరిజం కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ... సోమవారం అరకులో టూరిజం కార్మికులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎపి యుటిఎఫ్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మహేష్‌, ఆడిట్‌ కమిటీ కో కన్వీనర్‌ ఎల్‌.నారాయణ రావు మద్దతు తెలిపారు.