Nov 22,2023 10:52

'త్రిషపై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఒక నటిని మాత్రమే కాదు. ఏ స్త్రీని ఇలా అనకూడదు. చాలా అసహ్యంగా ఉన్నాయి. వీటిని తీవ్రంగా ఖండించాలి. త్రిషకు మాత్రమే కాదు.. ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయి ఎదుర్కొన్నా.. నేను అండగా ఉంటాను' అని హీరో చిరంజీవి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు ఇండిస్టీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. వాటిని ఖండిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌, నటి రోజా, రాధిక, గాయని చిన్మయి.. ఇలా టాలీవుడ్‌, కోలీవుడ్‌లకు చెందిన ప్రముఖులు ఈ వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. తాజాగా త్రిషకు మద్దతుగా చిరంజీవి పోస్ట్‌ పెట్టారు. అలీఖాన్‌ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.