జపాన్ : జపాన్, దక్షిణ కొరియాల మధ్య సముద్రంలో ఒక భారీ కార్గొషిప్ సముద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో షిప్లో 22 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో 8 మంది మరణించారు. వీరిలో ఆరుగురు చైనా జాతీయులు ఉన్నారు. షిప్ మునిగిపోయిన విషయాన్ని తెలుసుకున్న జపాన్, దక్షిణ కొరియా కోస్ట్ గార్డ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టారు. ఐదుగురు సిబ్బందిని వీరు కాపాడారు. వీరిలో నలుగురు చైనీయులు ఉన్నారు. అయితే మరో 9 మంది గల్లంతయినట్టు తెలుస్తోంది. ఈ షిప్ హాంకాంగ్కు చెందిన కంపెనీదిగా కోస్ట్ గార్డ్ సిబ్బంది గుర్తించారు. డిసెంబర్ 3న మలేషియాలోని పోర్ట్ క్లాంగ్ నుంచి ఈ నౌక బయల్దేరింది. కలప లోడ్తో వెళ్తున్న ఈ షిప్ జపాన్లోని నాగసాకికి నైరుతి దిశలో 160 కిలోమీటర్ల దూరంలో మునిగిపోయింది