Nov 21,2023 00:47
తిరుపాల్‌రెడ్డికి నివాళి అర్పిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-దర్శి: మండలంలోని బొట్లపాలెం గ్రామానికి చెందిన యూటీఎఫ్‌ మాజీ మండల అధ్యక్షులు యర్రగూటి తిరుపాలురెడ్డి(49) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. తిరుపాలురెడ్డి మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. కురిచేడు మండలం పడమర గంగవరం గ్రామంలో ఉపాధ్యాయుడిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. తిరుపాలు సతీమణి చీమకుర్తి మండల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తిరుపాలురెడ్డి యూటీఎఫ్‌ సంఘానికి బాధ్యతగా పనిచేస్తూ గతంలో కూడా మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యంలతో పరిచయాలు ఉన్నాయి. నేడు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తిరుపాలురెడ్డికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్దకుమారుడు కలకత్తాలో, రెండో కుమారుడు నాగపూర్‌లో చదువుతున్నారు. సంతాపం ప్రకటించిన వారిలో యూటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యులు పి రమణారెడ్డి, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ధనిరెడ్డి వెంకటరెడ్డి, మీనిగ శ్రీను, కాశిం, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు శ్రీనివాసులరెడ్డితో పాటు ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్‌రెడ్డి, కేవీజీ కీర్తి, సీపీఎం కార్యదర్శి రంగారావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పిచ్చయ్య, వైసిపి మండల అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కుమ్మిత అంజిరెడ్డి, వైసీపీ నాయకులు కేవీ రమణారెడ్డి, మండలంలోని యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌, గ్రామాల ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.