Nov 22,2023 00:45
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న డాక్టర్‌ ఉగ్ర

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి మునిసిపాలిటీలో 20వ రోజు మంగళవారం బొగ్గులగొంది కాలనీలో మన ఊరు-మన ఉగ్ర, భవిష్యత్తుకు గ్యారెంటీ బాబు ష్యూరిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాల గురించి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌ఛార్జి డాక్టరు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. మినీ మేనిఫెస్టో పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. సంక్షేమం పేరుతో సంక్షోభ పాలనను వైసీపీ ప్రభుత్వం సాగిస్తోందని విమర్శించారు. ప్రజల గోడు పట్టని వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని అన్నారు. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలని ప్రజల కోరుకుంటు న్నారని అన్నారు. టిడిపి మండల అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, నాయకులు వివిఆర్‌ మనోహరరావు, షేక్‌ ఫిరోజ్‌, తమ్మినేని వెంకటరెడ్డి, షేక్‌ అహ్మద్‌, బుల్లా బాల బాబు, పచ్చవ చంద్రశేఖర్‌, చింతలపూడి తిరుపాలు, ఆర్‌వి నారాయణ, పాలూరు సత్యం, ఈదర రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.