Nov 18,2023 15:58

ప్రజాశక్తి-ఏలూరు : మాజీ మంత్రివర్యులు మరియు ఒంగోలు శాసనసభ్యులైన  బాలినేని శ్రీనివాస రెడ్డి  స్థానిక మాతా శిశు వైద్యశాలలో నూతనంగా 1.76 కోట్లతో నిర్మించిన 50 పడకల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మాతా శిశు వైద్యశాల పుట్టిన పిల్లలకు వైద్యం అందించేందుకు అధినాతనమైన వైద్య పరికరాలను సమకూర్చుకోవడం జరిగిందని అదేవిధంగా మంచి వైద్యులు ఉన్నారని ప్రైవేట్ ఆస్పత్రికి పోటీగా ఇక్కడ తగినంత సిబ్బందితో వైద్యము అధునాతన పరికరాలతో అందిస్తున్నారని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. దీనికి సంబంధించి అప్రోచ్ సిమెంట్ రోడ్డు కూడా అతి త్వరలో నిర్మాణం చేస్తామని తెలియజేశారు.