Oct 23,2023 12:18

ప్రజాశక్తి-ఒంగోలు : ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో సోమవారం హార్ట్ కేర్ సెంటర్లు ప్రముఖ ఆడిటర్ వి మధుసూదన్ రావు  ప్రారంభించారు.  ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  ఆధ్వర్యంలో ఇప్పటికే న్యూరో ఆర్థోపెడిక్ జనరల్ మెడిసిన్ పలమనాలజీ గైనకాలజీ గ్యాస్ట్రో సర్జికల్ గ్యాస్టిక్ విభాగం సేవలను ఒంగోలు నగరంలో అందిస్తున్నారు నేడు ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ ను క్యాథల్యాబ్ ను ప్రారంభించి నేటి నుండి  సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ డైరెక్టర్స్ డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ ప్రకాష్ చావల,  డాక్టర్ కాప అనిల్ కుమార్, డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు,  మరియు హాస్పిటల్ ప్రముఖ డాక్టర్లు  గుండె వైద్యులు డాక్టర్ చివుకుల శ్రీధర్  డాక్టర్ పోకూరు శ్రీనివాసరావు, డాక్టర్ యు శ్రీనివాసరావు,  డాక్టర్ జోష్ణ, డాక్టర్ జి శ్రీనివాసరావు  హాస్పిటల్ సిబ్బంది ఇతర ప్రముఖులు  హాజరయ్యారు.