Sep 27,2023 20:20

హైదరాబాద్‌: నగరంలో గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు మెట్రో రైల్‌ అధికారులు తెలిపారు. యాత్రికుల సౌకర్యార్థం అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లు నడపనున్నట్లు పేర్కొన్నారు. రాత్రి 2 గంటల వరకు ఆయా రైళ్లు చివరి స్టేషన్లు చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు. ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. డిమాండ్‌ను బట్టి కొన్ని మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్‌ కౌంటర్లు, అదనపు రైళ్లు నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. 29న ఉదయం 6 గంటలకు యథాతథంగా మెట్రో రైల్‌ కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.