Sep 26,2022 20:57

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి 7.3 శాతం పెరుగొచ్చని గ్లోబల్‌ రేటింగ్‌ ఎజెన్సీ ఎస్‌అండ్‌పి అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 6.5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. సోమవారం ఎస్‌అండ్‌పి 'ఎకానమిక్‌ అవుట్‌లుక్‌ ఫర్‌ ఏషియా పసిఫిక్‌' పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ ఏడాది చివరి నాటికి కూడా ద్రవ్యోల్బణం ఆరు శాతం ఎగువనే నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.