Oct 19,2022 21:25

న్యూఢిల్లీ : బంగారం ధరలో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. బుధవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.276 తగ్గి రూ.50,747గా నమోదయ్యిందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల తగ్గుదలే ఇందుకు కారణమని పేర్కొంది. ఇంతక్రితం సెషన్‌లో రూ.50,747 వద్ద ముగిసింది. కిలో వెండిపై రూ.487 తగ్గి రూ.56,406గా నమోదయ్యింది.