Oct 24,2023 08:01

ఢిల్లీ : భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్‌, దిగ్గజ స్పిన్నర్‌ బిషన్‌ సింగ్‌ బేడీ (77) సోమవారం కన్నుమూశారు. స్లో లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ గా 1966 నుంచి 1979 వరకు భారత్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
1946 సెప్టెంబర్‌ 25న జన్మించిన బిషన్‌ సింగ్‌ బేడీ 67 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి 266 వికెట్లు తీసుకున్నాడు. 22 టెస్ట్‌ మ్యాచ్‌లకు జట్టుకు సారధ్యం వహించాడు. తన 15వ ఏట నార్త్రన్‌ పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశవాళీ క్రికెట్‌ లో అడుగు పెట్టాడు. ఆయనకు 1970లో కేంద్ర ప్రభుత్వం.. పద్మ శ్రీ పురస్కారాన్ని అందజేసి బిషన్‌ సింగ్‌ బేడీని గౌరవించింది. 2004లో సీకే నాయుడు లైఫ్‌ టైం అచీవ్‌ మెంట్‌ అవార్డు అందుకున్నారు.