హైదరాబాద్: దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో రానూపోనూ ప్రయాణానికి ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పించనున్నట్లు ప్రకటించింది.ఈ నెల 30లోగా ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్ని సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.