Nov 21,2023 21:48

పాచిపెంట ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి - కురుపాం : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళకుమారి అన్నారు. మంగళవారం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం ఐసిడిఎస్‌ సీనియర్‌ అసిస్టెంట్‌కు డిసెంబర్‌ 8 నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే నిరవధిక సమ్మె నోటీసును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జె. సరోజ, యూనియన్‌ నాయకులు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
పాచిపెంట : స్థానికఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు టి.ప్రభావతి, ప్రాజెక్ట్‌ నాయకులు సుశీల సీతమ్మ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి గతంలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వేతనం పెంచాలని, సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని, యాప్‌ల భారం తగ్గించాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, పెద్దఎత్తున అంగన్‌వాడీ పాల్గొన్నారు.