Nov 21,2023 19:33

చెక్కులు అందజేస్తున్న దృశ్యం

చెక్కులు అందజేస్తున్న దృశ్యం
సిఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ :ఆత్మకూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులకు నగదు మంజూరు చేయించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీధర్‌ గార్డెన్స్‌ లో జరిగిన కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలో పలు మండలాలకు సంబందించి రూ.18.63 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు కావడంతో బాధితులకు ఆయన అందచేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో చేజర్ల మండలం షేక్‌ హిమామ్‌ ఖాసీం, గుమ్మా రమేష్‌, విజయభాస్కర్‌, వాకా భాస్కర్‌ రెడ్డిలకు రూ.10.65లక్షలు మంజుర య్యాయని వివరించారు
.అదేవిధంగా సంగం మండలానికి చెందిన దుగ్గి సునందకు రూ.2లక్షలు, ఏఎస్‌ పేట మండలం, హసనాపురంకు చెందిన మారం గోవర్థన్‌ రావుకు రూ.3.60లక్షలు, మర్రిపాడు మండలం చిలకపాడుకు చెందిన బొర్రా వెంగమ్మకు రూ.18వేలు మంజూరు, ఆత్మకూరు పట్టణానికి చెందిన నాగులపాటి ప్రతాప్‌ రెడ్డికి రూ.2.20లక్షలు మంజూరు కావడంతో వారికి అందజేశారు. వైద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇలా బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నారని ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యావాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు.