Nov 21,2023 19:22

మాట్లాడుతున్న వైసిపి నాయకులు

మాట్లాడుతున్న వైసిపి నాయకులు
ప్రజా సంక్షేమమే వైసీపీ లక్ష్యం
ప్రజాశక్తి-వరికుంటపాడు:సంక్షేమ పథకాలు అమలులో పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న విధానాన్ని చూసి ప్రజలు తమ పట్ల ఆకర్షితులయ్యారని జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు మాగంటి శ్రీనివాసులు( సిద్ధయ్య) వైసిపి నాయకులు మాగంటి తిరుపతయ్య అన్నారు. మంగళవారం మండలంలోని తూర్పు బోయమడుగుల సచివాలయంలో సచివాలయ కన్వీనర్‌ బొడ్డు వెంకటేశ్వర్‌ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి అధికారం చేపట్టిన నాటి నుంచి పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న జగనన్న పాలనకు ప్రజలు నిరాజనాలు సమర్పిస్తున్నారు. రానున్న ఎన్నికలలో సంక్షేమ పథకాలను, జగనన్న చేస్తున్న అభివద్ధిని చూసి ప్రజలలో ఆదరణ పెరుగుతుందని రానున్న ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధించడం తథ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చేవూరు శ్రీదేవి, ఎంఎల్‌ఓ నారాయణ రాజు, సొసైటీ చైర్మన్‌ గుంటుపల్లి రామాంజనేయులు, అలీ అహ్మద్‌, మందలపు తిరుపత నాయుడు, సర్పంచులు చల్ల కొలుసు నాగరాజు, ఎర్రమల ప్రభాకర్‌ రెడ్డి, కొండే పోగు దిలీప్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.