Nov 21,2023 21:09

మాట్లాడుతున్న జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- బొబ్బిలి : రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. ఈనెల 23న బొబ్బిలిలో జరగనున్న సామాజిక సాధికార బస్సుయాత్రను జయప్రదం చేయాలని శ్రీకళాభారతిలో మంగళవారం వైసిపి నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపిను సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. సామాజిక సాధికార బస్సుయాత్రకు ప్రజలు హాజరయ్యేలా చూడాలని కోరారు. గత పాలకుల పాలనలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న వైసిపిని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ గతంలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉందని, తన హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసిపి విజయానికి ఐక్యంగా పని చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర నాయకులతో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, సీనియర్‌ నాయకులు శంబంగి వేణుగోపాలనాయుడు, ఇంటి గోపాలరావు, జేసీఎస్‌ కన్వీనర్లు, ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు తదితరులు పాల్గొన్నారు.