Nov 21,2023 19:57

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మహీధర్‌ రెడ్డి

ప్రజాశక్తి-గుడ్లూరు :రైతులకు నాణ్యమైన వద్యుత్‌ అందించడానికి మండలంలోని పొట్లూరులో 3/11 కెవి విద్యుత్తు ఉప కేంద్రాన్ని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర రెడ్డి మంగళవారం ప్రారంభించారు. 2.05 కోట్ల వ్యయంతో నిర్మించిన ఉప విద్యుత్‌ కేంద్రం ద్వారా పొట్లూరు, చెమిడిదిపాడు, పాజర్ల, స్వర్ణజపురం, ఆర్సి అగ్రహారం, అడవి రాజుపాలెం ,అమ్మవారిపాలెం గ్రామానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయటానికి వీలు కలిగిందని ఎంఎల్‌ఎ తెలిపారు. వోల్టేజి సమస్య లేకుండా వ్యవసాయ మోటారు, పంపు సెట్లలకి విద్యుత్‌ సరఫరా నిరాకటంగా సాగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఎస్‌ఇ సత్యనారాయణ, డి వెంకటేశ్వరు,్ల ఈ ఈ వీరయ్య, స్థానిక ఏ ఈ శ్రీనివాసులు, జడ్పిటిసి బాపి రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ కాపులూరి కష్ణ, గాజుల కిషోర్‌ ,పొట్లూరు గ్రామ ఉపసర్పంచి పులిపాటి ఈశ్వరయ్య ఉన్నారు.