Nov 18,2023 21:17

నృత్యం చేస్తున్న విద్యార్థినులు

            ప్రజాశక్తి-అనంతపురం    జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాల, జాతీయ సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహంచిన ఆర్ట్స్‌ అండ్‌ కల్చరరల్‌ ఫెస్ట్‌-2023 శనివారం రాత్రి వైభవంగా ముగిసింది. విద్యార్థినీ, విద్యార్థుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వర్శిటీలోని ఎన్‌టిఆర్‌ కళాక్షేత్రం మార్మోగింది. అదేవిధంగా విద్యార్థులకు పలు వకృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తర్వాత విద్యార్థులే స్వయంగా సంప్రదాయ వంటకాలను తయారు చేసి ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యంగా కేవలం రూ.65కు గ్యాంగ్‌స్టార్‌ బిర్యానీ కౌంటర్‌ పెట్టడంతో కిటకిటలాడింది. అదేవిధంగా రాయలసీమ బజ్జీల కౌంటర్‌కు మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఉపకులపతి రంగాజార్ధన, రిజిస్ట్రార్‌ శశిధర్‌, ప్రిన్సిపల్‌ సత్యనారాయణ, కన్వీనర్‌ జి.మమత, తదితరులు పాల్గొన్నారు.