Oct 20,2022 21:10

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల కంపెనీ షావోమీ ఇండియా దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల చేతుల్లోకి రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ అత్యుత్తమ '5జి ప్లస్‌' నెట్‌వర్క్‌ను తీసుకు వచ్చేందుకు ఒప్పందం కుదర్చుకున్నట్లు షావోమీ ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అనూజ్‌ శర్మ పేర్కొన్నారు. దీంతో తమ వినియోగదారులను 5జి విప్లవంలో ముందంజలో ఉంచేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.