Jul 03,2023 20:30

న్యూఢిల్లీ : ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ మరోమారు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జులై 17 నుంచి ప్యాసింజర్‌ వాహన ధరలను 0.6 శాతం హెచ్చించనున్నట్లు వెల్లడించింది. ముడి సరుకుల ధరలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇంతక్రితం జనవరి, మే మాసాల్లోనూ ధరలు పెంచింది.