Aug 09,2023 11:50

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 48 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆచంట నెహ్రూ సెంటర్‌ లో కృష్ణ - మహేష్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీగా బాణసంచాను కాల్చారు. అనంతరం భారీ కేకు కట్‌ చేసి మహేష్‌ బాబు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆచంట పురవీధుల గుండా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్‌ కుమార్‌ ముఖ్య అతిధిగా విచ్చేసి కేక్‌ కట్‌ చేసి అభిమానులకు శుభా కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మనవర్తి విజరు కుమార్‌, మనవర్తి శుభకర రావు, బొట్ల చక్రి, పితల జ్ఞాన్‌ రాజ్‌, మనీషా టైలర్‌, చిట్యాల శ్రీనివాస్‌, ఈతకోట మహేష్‌, పడమట సుబ్రమణ్యం, గరువు రామారావు, కోట ప్రసాద్ది, నరేంద్ర, పట్టాభి, వెంకట్‌ నారాయణ, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో కీర్తిశేషులు నట శేఖర్‌ ఘట్టమనేని కృష్ణ విగ్రహం ఆచంట లో ఏర్పాటు చేయునునట్టు నిర్వాహకులు తెలిపారు.