Nov 10,2023 13:06

ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : యూనియన్‌ బ్యాంక్‌ ద్వారా ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల రుణాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పాసర్లపుడి సర్పంచ్‌ కోనుకు ప్రేమ జ్యోతి నాగరాజు అన్నారు .శుక్రవారం యూనియన్‌ బ్యాంక్‌ 105 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు పాశర్లపుడి బ్రాంచ్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం బ్రాంచ్‌ మేనేజర్‌ పి వీరబాబు మాట్లాడుతూ....తమ బ్రాంచ్‌ 10 కోట్ల డిపాజిట్లు కలిగి ఉందని రూ 25 కోట్లను వివిధ రకాల రుణాలగా ఇచ్చినట్లు తెలిపారు. ముద్ర, హౌసింగ్‌, పి.ఏమ్‌.ఈ. జీ.పి. డ్వాక్రా , విద్యా రుణాలు అందిస్తున్నామని వాటిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా తమ బ్యాంక్‌ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తోరం భాస్కర రావు, వాకపల్లి వీరాస్వామి, బరుసు సత్తిబాబు,వేగి లక్ష్మి నారాయణ, తోలెటి ఆదినారాయణ, కుసుమ శివ, అసిస్టెంట్‌ మేనేజర్‌ జీ.బాలకఅష్ణ , సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.