Oct 18,2022 20:36

హైదరాబాద్‌ : అత్యంత కీలకమైన 100కు పైగా మేధోసంపత్తి హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు విద్యుత్‌ వాహనాల తయారీ కంపెనీ ప్యూర్‌ ఇవి వెల్లడించింది. దీంతో అత్యంత కీలకమైన మైలురాయిని చేరుకున్నట్లయ్యిందని పేర్కొంది. దీంతో బోర్న్‌ ఇవి స్టార్టప్స్‌ విభాగంలో అగ్రగామి సంస్ధగా నిలిచినట్లయ్యిందని ప్యూర్‌ ఇవి సిఇఒ రోహిత్‌ వదేరా పేర్కొన్నారు. అత్యంత బలమైన ఆర్‌ అండ్‌డి బృందాన్ని అభివృద్థి చేశామన్నారు. రాబోయే 18 నెలల్లో మరో రూ.200 కోట్ల పెట్టుబడులను లక్ష్యంగా చేసుకున్నామన్నారు.