Mar 02,2023 14:35

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : పట్టణ ప్రజల భద్రత దృష్ట్యా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు ఆదేశాల మేరకు అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌కు రెండు నూతన బ్లూ కోల్డ్‌ ద్విచక్ర వాహనాలు మంజూరయ్యాయని అర్బన్‌ సీఐ నరసింహారావు తెలియజేశారు. డీఎస్పీ శివ భాస్కర్‌ రెడ్డి ఆదేశాల మేరకు రెండు వాహనాలపై పట్టణంలో తిరుగుతూ గస్లీ పెంచనున్నట్లు తెలిపారు.