Sep 28,2023 12:38

హైదరాబాద్‌ : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతం తండ్రీకొడుకులు హస్తినలో ఉన్నారు. సాయంత్రం ఏఐసీసీ పెద్దలను ఇరువురు కలవనున్నారు. అనంతరం సాయంత్రం హన్మంతరావు, రోహిత్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి కాంగ్రెస్‌ రెండు టికెట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. మల్కాజ్‌గిరి నుంచి హన్మంతరావుకు, మెదక్‌ నుంచి రోహిత్‌కు సీటు కన్ఫామ్‌ చేసినట్లు బుధవారం మీడియాలో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. గురువారం వారిద్దరూ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని తెలిపారు. అందులో భాగంగా ఇవాళ వారిద్దరు ఢిల్లీ వెళ్లారు.