న్యూఢిల్లీ : కియా ఇండియా జులై 4న తన సరికొత్త సెల్టోస్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. నూతన సెల్టోస్ తాజా డిజైన్, మెరుగైన్ ఫీచర్స్ను కలిగి ఉంటుందని పేర్కొంది. ఇది నూతన విప్లవాన్ని సృష్టించనుందని వెల్లడించింది. 2019 ఆగస్ట్లో కియా సెల్టోస్ ఆవిష్కరణతో భారతదేశపు మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు 3.78 లక్షల యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది.










