Aug 23,2023 20:33

ప్రజాశక్తి-గుంటూరు : ప్రజాశక్తి జర్నలిజం కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ ఉన్నం వెంకటేశ్వర్లు రచించిన 'కాలంపై కవాతు' పుస్తకాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లి సుందరయ్యనగర్‌లోని ఆయన స్వగృహంలో సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి బుక్‌హౌస్ ఎడిటర్‌ ఎస్‌.వెంకట్రావు, ప్రజాశక్తి బుక్‌హౌస్ జనరల్‌ మేనేజర్‌ లక్ష్మయ్య, ప్రజాశక్తి అసిస్టెంట్‌ ఎడిటర్‌ కె.గడ్డెన్న, హైకోర్టు న్యాయవాది కృష్ణమూర్తి, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు పి.గిరిజ, వి.ఉష పాల్గొన్నారు.