Nov 18,2023 12:53

ప్రజాశక్తి - రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : ఎంపీ కేశినేని నాని నిధులతో రెడ్డిగూడెం కూనపరాజుపర్వ రహదారిలో బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.3 కోట్ల 14 లక్షల 28 వేలు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మండల టిడిపి అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గతంలోనే ఈ రహదారి కోసం పార్లమెంట్‌ సభ్యులు కేసినేని నాని రెండు కోట్ల 70 లక్షల నిధుల మంజూరు తో రహదారి నిర్మాణం జరిగిందని, ఈ రహదారి నిర్మాణంతో 22 కిలోమీటర్ల ప్రయాణ భారం తగ్గి 5 కిలోమీటర్లకు కూనపురాజుపర్వ వెళ్లడం జరుగుతుందని, మండల ప్రజలు ముఖ్యంగా రెడ్డిగూడెం కూనపరాజు పర్వ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపి కేసినేని నానికి కృతజ్ఞతలు తెలియజేశారు.