న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఒఐ) వాహన రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. ఏడాదికి 8.30 శాతం వడ్డీకే వాహన రుణాలు ఇవ్వనున్నట్లు ఆ బ్యాంక్ తెలిపింది. ఈ అవకాశం డిసెంబర్ 31వరకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించనున్నట్లు వెల్లడించింది.










