Oct 30,2023 11:45

శ్రీకాకుళం జిల్లా :  అసమానతల్లేని అభివృద్ధి  కోసం సిపిఎం ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని ' సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు సోమవారం  పిలుపునిచ్చారు. ఎచ్చెర్లలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం మాట్లాడుతూ నవంబరు 2న మందసలో సిపిఎం అఖిల భారత నాయకులు విజూ కఅష్ణన్‌ ప్రజా రక్షణ బేరి రాష్ట్ర బస్సు యాత్రను ప్రారంబిస్తారని తెలిపారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతల్లేని అభివఅద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యాన మూడు బస్సు యాత్రలు ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తూ నవంబర్‌ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు అత్యధిక ప్రజానీకం పాల్గొని  జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

బిజెపి పాలనలో మొత్తం దేశం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. మత విద్వేషాలు సృష్టిస్తున్న  బిజెపి ప్రభుత్వం దేశ సంపదనంతా అదానీ, అంబానీలకు దోచిపెడుతోందని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు అంటకాగుతున్నాయన్నారు.  రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ, మూతపడిన పరిశ్రమలు తెరిపించడం, ధరలు అదుపుచేయడం, వంటగ్యాస్‌ ధర 400రూ.లు, పెట్రోల్‌, డీజిల్‌ లీటరు 60రూ.లకే ఇవ్వడం, పేదలందరికీ ఉచిత విద్యా, వైద్యం అందించడం, మెగా డిఎస్సీ, నిరుద్యోగ భృతి  5000, రైతులకు గిట్టుబాటు ధర,  అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర చట్టం, కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజేషన్‌, కనీసవేతనం 26వేలు, స్కీం వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, పేదలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, మైనార్టీల హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్లు అమలు, వఅత్తుదారులు ఉపాధి భధ్రత, మహిళలకు రక్షణ, ప్రత్యేక హౌదా, విశాఖ రైల్వేజోన్‌, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి  ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, రైల్వేజోన్‌, విభజన హామీలు అమలు వంటివాటితో కూడిన ప్రజాప్రణాళిక సిపిఎం ప్రజల ముందుంచుతుందని తెలిపారు. ఇది అమలు జరిగే విధంగా సిపిఎం పార్టీని బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయుకులు సి.హెచ్‌.అమ్మన్నాయుడు, టి.నందోడు,  పొందూరు.చందర్రావు తదితరులు పాల్గొన్నారు.