Nov 20,2023 21:18

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసులరెడ్డి

కడప అర్బన్‌ : విద్యుత్‌ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షులు కామనురు శ్రీనివాసులరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో యూనియన్‌ అధ్యక్షులు బి.ఎన్‌. నాగసుబ్బయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం ఉద్యోగ సంఘాలతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. యాజమాన్యం బకాయిలు చెల్లించకపోతే ఉద్యోగులకు ఉద్యమాలే శరణ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌ రెడ్డి, డిస్కౌం అధ్యక్షులు ఎన్‌. శివ శంకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీహరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయబ్‌ రసూల్‌, రాజంపేట డివిజన్‌ అధ్యక్షుడు ఏరికల రెడ్డి, మైదుకూరు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌, ప్రొద్దుటూరు డివిజన్‌ అధ్యక్షులు షరీఫ్‌, కడప డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శివప్రసాద్‌ రెడ్డి, గోపీనాథ చార్యులు, జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.