టోక్యో : భారత్ కుర్రాడు షూటర్ సౌరభ్ చౌదరి అదరగొట్టాడు. 10 మీటర్ల పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లాడు. ఈ విభాగంలో మొత్తం 36 మంది పోటీపడగా 586-28 ఞ తో అగ్రస్థానంలో సౌరభ్ నిలిచాడు. సౌరభ్ ఆరు సిరీసుల్లో వరుసగా 95, 98, 98, 100, 98, 97 పాయింట్లు సాధించడం గమనార్హం. అతడి సహచరుడు అభిషేక్ వర్మ 575-19 ఞ తో 17 వ స్థానానికి పరిమితమయ్యాడు. ఈరోజు మధ్యాహ్నానికి పతకాన్ని ఎవరు చేజిక్కించుకుంటారో వేచిచూడాలి. టేబుల్ టెన్నిస్లో భారత్కు నిరాశే ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో శరత్ కమల్, మనికా బాత్రా జోడీ ఓటమి పాలైంది. మూడో సీడ్, చైనీస్ తైపీకి చెందిన లిన్ యున్ జు, చెంగ్ ఐ చింగ్ చేతిలో 11-8, 11-6, 11-5, 11-4 తేడాతో ఓడిపోయారు. వీరంతా వ్యక్తిగతంగా మహిళలు, పురుషుల విభాగాల్లో తలపడనున్నారు.