
లక్నో : పోలీసు శాఖలో జాగిలాలదీ ప్రత్యేక స్థానం. అతి క్లిష్టమైన కేసుల్లో వీటి పాత్ర కీలకంగా మారిన ఘటనలు అనేకం విన్నాం. అందుకే వాటికి ప్రత్యేక ట్రైనింగ్, భద్రత, సరంక్షణ చూస్తుంటారు పోలీసులు. అలా శాఖలో సేవలందించి...చనిపోయిన ఎఎస్పి టింకీ శునకానికి అరుదైన గౌరవం దక్కింది. 49 కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన ఆ జాగిలానికి విగ్రహాన్ని కట్టి..గుర్తింపునిచ్చారు యుపి పోలీసులు. ముజఫర్ నగర్ డాగ్స్క్వాడ్కు చెందిన ఆ శునకం..గత ఏడాది నవంబర్లో చనిపోయింది. ఇది చేసిన సేవలకు గానూ..పోలీసులు ఈ విహ్రాన్ని ఏర్పాటు చేశారు. టింకీ పర్యవేక్షకుడు సునీల్ కుమార్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.