Nov 20,2023 19:56

అర్జీలను స్వీకరిస్తున్న గోవిందు సింగ్‌

ప్రజాశక్తి - ఆదోని
స్పందనలో లబ్ధిదారుల నుంచి స్వీకరించిన అర్జీలను గడువులోపు పరిష్కరించాలని ఎఒ గోవిందు సింగ్‌ అధికారులకు సూచించారు. సోమవారం ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో స్పందన నిర్వహించారు. డివిజన్‌ పరిధిలోని ఆయా ప్రాంతాల లబ్ధిదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవస్థ పట్ల నమ్మకం కలిగేలా స్పందన దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరిస్తే బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎలోకి వెళ్లకుండా ఉంటాయని తెలిపారు. అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సమస్య పరిష్కారం అవుతుందా లేదా అర్థమయ్యే విధంగా వివరించాలని చెప్పారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ వేణు సూర్య, డిఎల్‌డిఒ నాగేశ్వరరావు, ఆర్‌టిసి డిపో మేనేజర్‌ మహ్మద్‌ రఫీ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ చేతన్‌ ప్రియ, సీనియర్‌ సహాయకులు రామయ్య పాల్గొన్నారు.